MBNR: శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి నూతన పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నూతన కార్యవర్గానికి నియామక ఉత్తర్వులు (జీవో) అందజేశారు. ఆలయ అభివృద్ధికి పాలకమండలి సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నూతన ఛైర్మన్ గౌని గోవర్దన్ రెడ్డి, పాలకమండలి సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.