BDK: భద్రాచలం పట్టణానికి చెందిన మద్దాల పవన్ సాయి మోహన్ మంగళవారం శ్రీసీతారామచంద్రస్వామివారికి సుమారు 655 గ్రాముల బరువు కలిగిన వెండి పళ్లెమును విరాళంగా సమర్పించారు. దీని విలువ సుమారు రూ.1,70,000 ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దాత పవన్ సాయి మోహన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు.