ADB: బోథ్ మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక మడవి శ్రీదేవి(14) అనే బాలిక మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత అర్ధరాత్రి నుండి బాలిక తీవ్ర వాంతులు విరోచనాలతో బాధపడుతుందని మంగళవారం ఉదయం విరోచనాలు ఎక్కువై అపస్మారక స్థితిలోకి చేరుకుని చనిపోయిందని వారు తెలిపారు.