BHNG :భువనగిరి శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఇవ్వాళ భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.