GDWL: జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్గా సీహెచ్ మధుమోహన్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన లక్ష్మీనారాయణ పదవీ విరమణ చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీవోగా ఉన్న మధుమోహన్ను ఈ పదవికి ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా పాలనలో కీలక బాధ్యతలు చేపట్టనున్న ఆయన, త్వరలోనే పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.