MBNR: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 10TH, ఇంటర్ ఫలితాల్లో రాణించిన ప్రభుత్వ మైనారిటీ గురుకుల విద్యార్థులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.