PDPL: ఓదెల మండలం కొలనూర్ రైతు వేదికలో మంగళవారం “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక”లో భాగంగా రైతు వారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా PJTAU శాస్త్రవేత్తలు డా. తిరుపతి, డా.రాణి ఆధునిక సాగు, సేంద్రియ పద్ధతులపై అవగాహన కల్పించారు. సిఫారసు చేసిన వరి రకాల సాగుతో లాభాలు పెరుగుతాయని సూచించారు. భూసార పరీక్షలు, ఎరువుల సమతుల వినియోగాన్ని వివరించారు.