BHNG: వలిగొండలోని రాజీవ్ చౌరస్తా వద్ద ఇవాళ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు పాశం భాస్కర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.