MNCL: మంచిర్యాల ఐబీ చౌరస్తాలో మంగళవారం ఈ 12న హైదరాబాద్లోని జల విహార్లో జరగనున్న తెలంగాణ జన సమితి పార్టీ 4వ ప్లీనరీ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఎండీ సిరాజ్, బచ్చలి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ప్లీనరీలో భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు.