భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని 4వ తేదీన తెల్లవారుజామున ఒంటి గంటకు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పెంబుల దుర్గా భవాని (17) అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు బి.ఎన్.ఎస్ సెక్షన్ 137(2) కింద ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.