NLG: చిట్యాల మండలం ఏపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. విద్యార్థులకు ఇవాళ మెమోలను పంపిణీ చేశారు. జిల్లాలో 4వ ర్యాంకు సాధించిన తర్ర అఖిల్ (573), మండల స్థాయిలో టాపర్స్గా నిలిచిన లక్ష్మి ప్రసన్న, శివమణి, భవానిలను సర్పంచ్ పాలెం మహేష్, హెచ్ఎం మోహన్ రెడ్డి అభినందించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.