HYD: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి శంషాబాద్ హార్డ్వేర్ పార్కులో రూ.453 కోట్లతో ITP Aero ప్లాంట్కు మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. 10 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ యూనిట్లో విమాన ఇంజన్ల కీలక భాగాలు తయారవుతాయి. 2027 నాటికి అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్ ద్వారా సుమారు 600 మంది నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి లభించనుంది. రాష్ట్ర ఏరోస్పేస్ రంగానికి ఇది మరో మైలురాయి.