NLG: వేసవిలో దొంగల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఐ రాజు సూచించారు. శుభకార్యాల కోసం ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రి వేళల్లో ఆరుబయట నిద్రించేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించవద్దని హెచ్చరించారు. భద్రత కోసం ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ఆయన కోరారు.