VKB: సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 8న కొడంగల్కు రానున్నట్లు అధికారులు తెలిపారు. పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్ శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ పరిసరాల్లో ఇళ్లను తొలగించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.