BDK: 24 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి రోజుకు 15 నుంచి 20 సార్లు కరెంటు కోత విధిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు కాంగ్రెస్ను విమర్శించారు. ప్రజలను, రైతులను, వినియోగదారులను, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇవాళ పాల్వంచ సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో ధర్నా చేపట్టారు. కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు అందించాలని వారు డిమాండ్ చేశారు.