NRML: ఖానాపూర్ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లింపుకు గడువు పెంచినట్లు ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం 2026-27కు సంబంధించి ఇచ్చిన ఐదు శాతం రాయితీ చెల్లింపు గడువు ముగిసిపోగా ప్రభుత్వం మళ్లీ గడువు పెంచిందని, ఈనెల ఏడు వరకు ఐదు శాతం రాయితీతో చెల్లించవచ్చునని తెలిపారు.