SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జనగణనపై మూడో రోజు ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శిక్షకులు రహీం, సంగ్శెట్టి సెన్సెస్ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జనగణన, ఇంటి గణన సర్వే ఏ విధంగా చేపడతారో.. దీనిపై ఎన్యూమరేటర్, యజమాని మధ్య సంభాషణపై చక్కగా ప్రదర్శించారు.