MNCL: ధాన్యం కొనుగోలులో లోటుపాట్లు రాకుండా చూడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాములు ఆదేశించారు. మంగళవారం జన్నారం మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ ఉన్నారు.