TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను చేవెళ్ల వాసులుగా పోలీసులు గుర్తించారు. తుల్జాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.