TG: నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు కన్నెర్ర చేశారు. గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేకపోవడం.. ఈనామ్ సర్వర్కు చెందిన సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో అధికారులు లాట్ నంబర్ కేటాయిండం లేదు. దీంతో నిజామాబాద్ మార్కెట్లో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మార్కెట్లోని కార్యాలయం ఆద్దాలను ధ్వంసం చేసి మరీ నిరసన తెలిపారు.