AP: పోలవరం-నల్లమల సాగర్ వల్ల ఎవ్వరికీ నష్టం లేదు అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘సముద్రంలోకి వెళ్లే నీటిని మేం ఉపయోగించుకుంటాం. కాళేశ్వరం గోదావరిపైనే కట్టారు.. నేను అభ్యంతరం చెప్పలేదు. నలమల సాగర్తో తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేదు. మేం కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణ వారు కూడా నల్లమల సాగర్కు అభ్యంతరం చెప్పొద్దు’ అని పేర్కొన్నారు.