పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించడంలో జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం వైభవ్పై యశస్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. వైభవ్ నిర్భయంగా బంతిని కొట్టే విధానాన్ని చూసి నేను ఎప్పుడూ సంతోషిస్తాను’ అని చెప్పుకొచ్చాడు.