AP: జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ మొదలు పెట్టారని తెలిపారు. మట్టి పనులు చేసి రూ.800 కోట్లు దోచుకున్నారని చెప్పారు. పెద్దిరెడ్డి కంపెనీకి జగన్.. పాలమూరు- రంగారెడ్డి టెండర్లు ఇప్పించారని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన ద్రోహి జగన్ అని మండిపడ్డారు.