ADB: జిల్లాలోని కోర్టుల్లో మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తెలిపారు. క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంక్, మోటార్ ప్రమాద క్లెయిమ్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ తిరగకుండా సమయం, డబ్బు ఆదా చేసుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.