SRD: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కంగ్టి మండలం చుక్కలతీర్థం మాజీ సర్పంచ్ రమేష్ పాటిల్(49) ఇవాళ మృతి చెందారు. ఈ నెల 10న పొలం పనులపై రాసోల్ వెళ్లి తిరిగి రాత్రి తడ్కల్కు వెళ్తుండగా ముర్కుంజాల్ శివారులో బైకు అదుపుతప్పి ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఆస్పత్రిలో బ్రెయిన్ ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమించి మరణించారు.