»Icc Website Makes India The No 1 Test Team Then Reverses Ranking In Shocking U Turn As Confusion Reigns Supreme
ICC-Team India : టీమిండియాకు ఐసీసీ షాక్….!
ICC-Team India : టీమిండియాకు ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. టెస్టు ర్యాంకింగ్ విషయంలో ఐసీసీ చేసిన తప్పుతో... టీమిండియా మొదటి స్థానం నుంచి చేజారింది. టీమిండియా అగ్రస్థానంలో ఉందని ప్రకటించిన కొద్ది గంటలకే తన తప్పును తెలుసుకుంది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉందని, భారత్ రెండో స్థానాల్లో ఉందని వెల్లడించింది.
టీమిండియాకు ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. టెస్టు ర్యాంకింగ్ విషయంలో ఐసీసీ చేసిన తప్పుతో… టీమిండియా మొదటి స్థానం నుంచి చేజారింది. టీమిండియా అగ్రస్థానంలో ఉందని ప్రకటించిన కొద్ది గంటలకే తన తప్పును తెలుసుకుంది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉందని, భారత్ రెండో స్థానాల్లో ఉందని వెల్లడించింది. వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య కారణంగా తప్పిదం జరిగిందని వివరణ ఇచ్చింది. దీంతో భారత క్రికెట్ జట్టుతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులు కూడా తీవ్రనిరాశకు గురయ్యారు.
ఫిబ్రవరి 15వ తేదీ మధ్యాహ్నం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. 115 పాయింట్లతో భారత జట్టు అగ్రస్థానంలో నిలిచిందని, ఆస్ట్రేలియా 111 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. ప్రకటించిన కొన్ని గంటల్లోనే తన తప్పును తెలుసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో తిరిగి టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టు 126 పాయింట్లతో టాప్ పొజిషన్ లో ఉందని, 115 పాయింట్లతో ఉన్న టీమిండియా రెండో స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది.
గత నెల మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో కివీస్ జట్టును వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డేల్లో నెంబర్ వన్ పొజిషన్ చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కూడా భారత జట్టు దుమ్మురేపింది. తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకులు నిజమేనని అందరూ నమ్మారు. ఆనందంలో మునిగి తేలారు.అయితే.. ఒక్కసారిగా ఆనందం ఆవిరయ్యింది. ఐసీసీ చేసిన ప్రకటన అసంతృప్తి జ్వాలలు రగిలించింది. ఐసీసీ చేసిన తప్పుపై భారత అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు.