కామారెడ్డి జిల్లాలోనీ నాగిరెడ్డిపేట మండల సమాఖ్య ఏపీఎంగా వెంకటలక్ష్మీ బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎల్లారెడ్డి ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ఇన్ఛార్జ్గా పని చేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని వెంకటలక్ష్మీ తెలిపారు.