ప్రకాశం: సింగరాయకొండ 16 నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ప్రైవేట్ అంబులెన్స్ డివైడర్ని ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న ఒకరికి గాయాలయ్యాయి. నిద్రమత్తుతో అంబులెన్స్ డ్రైవరు వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.