ప్రకాశం: సీఎం చంద్రబాబు బుధవారం దోర్నాల మండలంలో వెలిగొండ ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు. గిద్దలూరు నియోజకవర్గానికి వెళ్లే నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కంభం, గిద్దలూరు, కొమరోలు మీదుగా కడప జిల్లాలోకి కృష్ణా జలాలు వెళ్తాయని అధికారులు తెలిపారు. నల్లమల అడవిలోని గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాల గురించి సీఎం అధికారులతో చర్చించారు.