SKLM: సామాజిక న్యాయం పటిష్టంగా అమలు చేయాలంటూ శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సంపద పంపిణీలో అందరికీ సమానంగా జరగాలని జిల్లా పార్టీ నాయకులు తిరుపతిరావు అన్నారు. కార్మికులకు పనిగంటలు తగ్గించి తగిన వేతనాన్ని చెల్లించాలన్నారు. సంఘాల నాయకులు పాల్గొన్నారు.