MDK: చిన్నశంకరంపేట(మం) కామారం రెండో వార్డులో శుక్రవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గడ్డం సుజాత, ఉప సర్పంచ్ సుధాకర్ ప్రారంభించారు. జీపీ నిధులతో ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ సైట్ ఇంజినీర్ మహేందర్, గ్రామ కార్యదర్శి సుమలత, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.