సత్యసాయి: పెనుకొండ పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. మరుపల్లి గ్రామ శివారులోని చెరువు సమీపంలో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై రవికుమార్ సిబ్బందితో కలిసి వెళ్లారు. అక్కడ బహిరంగంగా పేకాట ఆడుతున్న ఆరుగురు జూదగాళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16,120 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.