ప్రకాశం: అర్ధవీడు మండలం బొమ్మిలింగం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి 35వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం వైసీపీ ఇన్ ఛార్జ్ కేపీ నాగార్జున రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎడ్ల పందాలు పోటీలను ఆయన ప్రారంభించారు. పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు భారీగా వచ్చారు.