PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షకు 97.89 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాధన జూనియర్ కళాశాలలో మొత్తం 571 మంది విద్యార్థులను కేటాయించగా, 559 మంది విద్యార్థులు హాజరయ్యారు. 12 మంది గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.