SRC: జిల్లాలో నిర్వహించే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సంబంధిత జిల్లా అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు.