ADB: అత్యవసర సమయాల్లో డయల్ 100ను సంప్రదించాలని పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్ అన్నారు. బుధవారం నార్నూర్ మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రం వద్ద ‘డయల్ 100’ అవగాహన సదస్సు నిర్వహించారు. వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పుండలీక్, సుధాకర్, నాగోరావ్, తదితరులు పాల్గొన్నారు.