MNCL: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నెన్నెల మండల తహసిల్దార్ శ్రీనివాస్ తెలిపారు. మైలారం గ్రామానికి లబ్ధిదారురాలు కొయ్యడ ఉమారాణికి మంజూరైన కల్యాణ లక్ష్మి పథకం చెక్కును గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గట్టు మల్లేష్, AMC డైరెక్టర్ గోలేటి సంధ్య తదితరులు పాల్గొన్నారు.