జగిత్యాల రూరల్ మండలంలోని రఘురాములకోట గ్రామంలో గర్భిణి మధురకు గురువారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకోగా, నొప్పులు అధికం కావడంతో, పరిస్థితిని గమనించిన 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇంటి వద్దనే పురుడు పోశారు. మధుర పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు.