TG: విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలు ఉల్లంఘించి విధులకు రాని 94 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు డీఎంఈ టెర్మినేషన్ నోటీసులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చిలో చేపట్టనున్న 600 మంది వైద్యుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఖాళీలను క్లియర్ చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.