KMR: బిక్కనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఎస్సై ఆంజనేయులు సందర్శించి భద్రతను పర్యవేక్షించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అపరిచితులకు అనుమతి లేదన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ దుకాణాలు తెరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.