అల్లూరి: కొయ్యూరు మండలం బాలారం ఏకలవ్య మోడల్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో (సీబీఎస్ఈ) 100 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ కుమార్ బుధవారం తెలిపారు. 30 మంది బాలురు, 30 మంది బాలికలు మొత్తం 60 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. నంద కిషోర్ 446/500, బద్రి 442/500 పాఠశాలలో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచారని తెలిపారు.