PLD: జిల్లావ్యాప్తంగా మంగళవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జనరల్ కోర్సుల్లో నమోదైన 16,088 మంది విద్యార్థులకు గాను 15,523 మంది హాజరయ్యారు. అలాగే వృత్తి విద్యా కోర్సుల్లో 950 మందికి గాను 880 మంది పరీక్ష రాశారు. మొదటి రోజు పరీక్షకు మొత్తం 642 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు.