RR: నందిగామ కన్హ శాంతి వనంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఇండియా స్కిల్ రిజనల్ కాంపిటీషన్ నేడు ముగింపుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్తో పాటు నగదు ప్రోత్సాహం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత విద్యతో పాటు ఏదో ఒక కొత్త రంగంలో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు.