మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 27 డివిజన్లో కౌన్సిలర్ తేజస్విని మంగళవారం కాలనీలలో పర్యటించారు. కౌన్సిలర్ వెంట మున్సిపాలిటీ అధికారులు, కాలనీ పెద్దలు ఇంటింటికి వెళ్లి సమస్యల తీవ్రతపై దరఖాస్తులను స్వీకరించారు. గత ఎన్నికల ముందు కాలనీవాసులకు ఇచ్చిన హామీ మేరకు హనుమాన్ దేవాలయ నిర్మాణంకు అవసరమైన మెటీరియల్ను పాలకమండలి సభ్యులకు అందజేశారు.