SDPT: సదాశివపేట మండలం సూరారం గ్రామ శివారులోని గంగకత్వ కాలువలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. మృతుడు కోహిర్ మండలం కొత్తూరు(డి) గ్రామానికి చెందిన గొల్ల గోపాల్ (35)గా గుర్తించారు. ఈ నెల 22 మిస్సైన గోపాల్.. ఇవాళ శవమై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.