SRCL: ఇంటర్మీడియట్ పరీక్షలకు చందుర్తి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీప్ సూపర్డెంట్ మోహన్ కుమార్ తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొత్తం 100 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు128 మంది మొత్తం 228 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.