JGL: వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన గాలి సౌమ్యశ్రీ జూనియర్ ఇంటర్లో 470కి 469 మార్కులు సాధించి రాష్ట్ర తొలి స్థానం దక్కించుకుంది. గ్రామంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు తులసి ఆగమయ్య, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.