PPM: జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న ఫేస్ యాప్ ఇబ్బందులను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం పార్వతీపురంలోని డ్వామా (DWMA) కార్యాలయంలో హెచ్.ఆర్. బి.శివరామకృష్ణను కలిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు వినతిపత్రం అందజేశారు. నెట్-వర్క్ లేని ప్రాంతాల్లో కూలీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.