మణిపురి చిత్రం ‘బూంగ్’ ప్రతిష్టాత్మక BAFTA 2026 అవార్డు గెలవడంపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. మణిపూర్కు ఇది గర్వకారణమని ఆయన పేర్కొనగా.. నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రం అట్టుడుకుతున్నప్పుడు స్పందించని ప్రధాని, ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం బాధ్యతారాహిత్యమని ఫైరవుతున్నారు. సమస్యల నుంచి దృష్టి మళ్లించడమేనని మండిపడుతున్నారు.