GDWL: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే జరిగిందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డా.ఆంజనేయ గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల్లో వ్యక్తిగత నిర్ణయాలకు చోటు లేదని ఆయన తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం సోషల్ మీడియాలో అనవసర వాదోపవాదాలు సరికాదని హితవు పలికారు.